వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జానకి
May 25, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కాశీం పూర్ గ్రామంలో ఐకెపి ద్వారా వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కేంద్రాని జిల్లా సమైక్య అధ్యక్షురాలు జానకి పరిశీలించారు.ఈ సందర్భంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు జానకి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూకాలు వేయాలని తూకంలో ఎలాంటి అవకతవకలు ఉన్న ఉపేక్షించేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సెంటర్ ఇంచార్జ్ లు గ్రామ సంఘం అధ్యక్షురాలు మంగమ్మ,గ్రామ సంఘం కార్యదర్శురాలు అరుణమ్మ,పద్మ, సునీతమ్మ,రైతులు,తదితరులు ఉన్నారు.