నగరేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి.... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
April 26, 2026
Prajagalam News
(తాండూర్)
మా ప్రభుత్వం హయాంలో అధికారికంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలో శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలకు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.