25లోపు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి
March 20, 2026
Prajagalam News
25లోపు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి
కుల్కచర్ల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకానికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు,ఇప్పటి వరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు, బ్యాంకు వివరాలు నమోదు చేయని రైతులు వెంటనే యాసంగి సీజన్ కు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాలని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు.శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులు రైతు వేదికలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్, ఫోన్ నెంబర్ లను అందజేయాలని తెలిపారు.
- కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు