schedule Wednesday, July 29, 2026

చర్చకు సిద్ధమా కేటీఆర్

calendar_today June 30, 2026
person Prajagalam News
చర్చకు సిద్ధమా కేటీఆర్
   -:స్పీకర్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించం :-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్
  • వికారాబాద్- బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,బీఆర్ఎస్ పాలన కాలం ముగిసే సమయంలో జి.ఓలు ఇచ్చి ఫైనాన్స్ క్లియరెన్స్ చేయలేదని,బీఆర్ఎస్ జి.ఓ లు ఇచ్చి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారసింగ్ అన్నారు.కేటీఆర్ ఎస్ ఐ ఆర్ కార్యకర్తల సమావేశం వికారాబాద్ లో నిర్వహించి ,సీఎం రేవంత్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,ప్రభుత్వం పై విమర్శలు చేయడం తగదన్నారు.కేటీఆర్ కు రాష్ట్రంలో అమలు అవుతున్న 6 గ్యారెంటీలు కళ్ళకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కేటీఆర్ దృతరాష్ట్రుడితో పోల్చడం బాధాకరమని, స్పీకర్ ను అన్ని పార్టీల వారు,దేశంలోనే బెస్ట్ స్పీకర్ గా గుర్తించిన కేటీఆర్ కు వినిపించడం లేదా అని అన్నారు. ఎమ్మెల్యే లు పార్టీల ఫిరాయింపు కార్యక్రమంకు శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కదా అని ధారసింగ్ ప్రశ్నించారు.కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుల్లు కుంటున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాన్ని చూపించగలరా అని సవాళ్లు విసిరారు.బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చి పోయారని,అప్పులను కడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విజయవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని తెలిపారు.
మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ....కేటీఆర్ స్పీకర్ పై అవాక్కులు చవక్కలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు.బీఆర్ఎస్ అధికారంలో ఉండి వికారాబాద్ నియోజకవర్గము లో ఏ చేసిందో చెప్పాలని అన్నారు.గుంతల రోడ్లు ఉంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రోడ్లు వేస్తున్నామని అన్నారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా మాట్లాడవచ్చు అని కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంభం మొత్తం ప్రజలను దోచుకొని దాచుకుందని అన్నారు.మున్సిపల్ ఎస్టీపి బీఆర్ఎస్ హయాంలోనే పాడైపోయిందని,తాము దానిని బాగు చేసేందుకు టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ..స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని అన్నారు.బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నాయకుల పై అనేక కేసులు పెట్టారని...అలా తాము ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు.దీని విషయంలో ఇద్దరం శ్వేతా పత్రం విడుదల చేద్దామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేస్తుంటే ఓర్వలేక ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందోనన్ని దానిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.వికారాబాద్ మండలంలో పెద్ద ఎత్తున్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని,ప్రతి రోడ్డులను డబుల్ రోడ్లు వేయిస్తున్న ఘనత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చెందుతుందన్నారు.స్పీకర్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ రాం చందర్ రెడ్డి, చిగుళ్ల పల్లి రమేష్ తదితరులు ఉన్నారు.