schedule Wednesday, July 29, 2026

కుల్కచర్ల, బండవెల్కిచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలు తనిఖీ చేసిన డీటీడీవో జనార్దన్ 

calendar_today July 24, 2026
person Prajagalam News
కుల్కచర్ల, బండవెల్కిచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలు తనిఖీ చేసిన డీటీడీవో జనార్దన్ 
  (ప్రజాగళం, కుల్కచర్ల)

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని వికారాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్ధన్ తెలిపారు.గురువారం పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల, బండవెల్కిచర్ల ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో విద్యార్థుల హజరు రికార్డులు, భోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా డీటీడీవో జనార్దన్ మాట్లాడుతూ... విద్యార్థులందరూ పాఠశాలకు వచ్చే విధంగా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా హాజరు నమోదు, ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించేలా చూడాలన్నారు. వసతిగృహ పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. మెనూ ప్రకారం భోజనాన్ని వండటమే కాకుండా పరిశుభ్రతను కూడా పాటించాలన్నారు. తరగతుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి తెలియజేశారు.అనంతరం నూతనంగా జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా కుల్కచర్ల మండలంలో పర్యటించిన సందర్బంగా డిటిడిఓ జనార్దన్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహ అధికారి సుందర్, ఉపాధ్యాయులు రాజేందర్ నాయక్, సతీష్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు .